మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి, మంచి అంచనాలతో రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పరుచూరి బ్రదర్స్ రచన చేసిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలను అందించగా, రత్నవేలు ఫోటోగ్రఫీని అలానే బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించడం జరిగింది. తమన్నా, అనుష్క శెట్టి, నిహారిక కొణిదెల ఇతర ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, రవి కిషన్, జగపతి బాబు, 

విజయ్ సేతుపతి వంటి పలు భాషలకు చెందిన దిగ్గజ నటులు నటించడం జరిగింది. ఇకపోతే రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్ విషయమై ఇప్పటికే పలు ఫిగర్స్ బయటకు రావడం జరిగింది. ఎక్కువగా ప్రచారం అవుతున్న దానిని బట్టి ఈ సినిమాకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.54 కోట్లు, మరియు తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కలిపి రూ.20 కోట్లు, హిందీ వెర్షన్ లో రూ.3 కోట్లు, అలానే ఓవర్సీస్ లో రూ.14 కోట్లు. 

ఇలా మొత్తం కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సైరాకు రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని, అలానే రూ.65 కోట్ల పైచిలుకు షేర్ వచ్చిందని చెప్తున్నారు. ఇక మరికొంతమంది అయితే ఓవర్ అల్ గా తొలి రోజు రూ.85 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇక మరికొందరు అయితే సైరా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ని తొలిరోజు సునాయాసంగా కొట్టేసింది అని అంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ పై పక్కాగా ఫిగర్స్ బయటకు రానప్పటికీ, కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల గ్రాస్, అలానే రూ.52 కోట్ల షేర్ కొల్లగొట్టినట్లు చెప్తున్నారు. అయితే ఈ లెక్కలపై కూడా కొంత అధికారిక ప్రకటన వెలువడవలసి ఉందట. మరి సైరా రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్షన్స్ తో దూసుకెళ్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: