నిర్మాతగా కూడ రాణించాలని విజయ్ దేవరకొండ తన ప్రయత్నాలు మొదలుపెట్టి దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా చేసి తీసిన మూవీ ‘మీకు మాత్రమే చెప్తా’ దసరా సీజన్ కు రిలీజ్ కావలసి ఉంది. అయితే ‘సైరా’ మ్యానియాకు భయపడిపోయి ఈ మూవీని అక్టోబర్ 18కి వాయిదా వేసారు.

అయితే ఇప్పుడు అదే డేట్ కు ‘ఆర్ డి ఎక్స్ 100’ విడుదల అవుతున్నా విజయ్ ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు వెంకటేష్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం విజయ్ దేవరకొండను కలవర పెడుతున్నట్లు టాక్. ‘సైరా’ కలక్షన్స్ మ్యానియా ఊహించిన స్థాయిలో లేకపోవడంతో వెంకటేష్ తన ‘వెంకీ మామ’ సినిమాను నవంబర్ లో కాకుండా అక్టోబర్ 18న విడుదల చేయమని వెంకీ పట్టు బడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘వెంకీ మామ’ రిలీజ్ కు రెడీ అయిన నేపధ్యంలో ‘సైరా’ హడావిడి చల్లబడిన తరువాత ఈ నెలాఖరున రాబోతున్న దీపావళి పండుగను కూడ క్యాష్ చేసుకోవాలని వెంకటేష్ ఆలోచన.

దీనితో ఇప్పుడు ఈ న్యూస్ విజయ్ దేవరకొండకు షాకింగ్ గా మారింది అని అంటున్నారు. చిరంజీవి నుంచి తప్పించుకుందాము అనుకుంటే ఇప్పుడు వెంకటేష్ అడ్డు తగులుతూ ఉండటంతో సేఫ్ గేమ్ ఆడాలని విజయ్ తన ‘మీకు మాత్రమే చెప్తా’ ను నవంబర్ 1కి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

నిర్మాతగా తాను చేస్తున్న మొదటి ప్రయోగం కాబట్టి ఈ ప్రయోగం ఎక్కడా ఫెయిల్ కాకుండా చూసుకోవడానికి సింగిల్ గా ఎటువంటి పోటీ లేని రిలీజ్ డేట్ వైపు విజయ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘డియర్ కామ్రేడ్’ పరాజయం తరువాత విజయ్ తాను నటించే సినిమాల విషయంలోనే కాకుండా తాను తీసే సినిమాల విషయంలో చేసే వ్యాపారాల విషయంలో ఎటువంటి ప్రయోగాలకు తావు ఇవ్వ కూడదని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: