మెగా అభిమానులు ఎదురు చుసిన మెగాస్టార్ సినిమా సైరా.. ఈ మొన్న గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా చాలా మందికి నచ్చదని వెల్లడిస్తున్నారు. మరికొందరు మాత్రలు సినిమాలో చిరంజీవి యాక్టింగ్ బాగుంది. మిగిలిన సన్నివేశాలు ఎవరికీ నచ్చలేదు అందుకే ఈ సినిమా మిశ్రమ టాక్ తో సాగుతుంది. సినిమాను కథ ప్రకారంగా న్యాచురల్ గా సాగలేదు. 


ఇకపోతే ఈ సినిమాలో పరాటాలు పేరుతో అంతా గ్రాఫిక్స్ మాయం చేసారూ డైరెక్టర్. ఎదో మసి పూసి మారేడు కాయ చేసాడు. చరిత్ర అని చెప్పి గ్రాఫిక్స్ పెడితే ఎం ప్రయోజనముంటుంది అని జనాలు అంటున్నారు. క్రిటిక్స్ విష్యాయానికొస్తే సినిమా పర్వాలేదని పించిందని వెల్లడించారు. ఈ సినిమాను రామ్ చరణ్  నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 


ఇలాంటి సినిమాలు చేయడం ఆయనకు కొత్త అయినా బాగానే తెరకెక్కించారు అని అంటున్నారు. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, నయనతార, అనుష్కలు నటించారు. సినిమా ఓ మాదిరిగా హిట్ అవ్వడంతో అందరికి రెమ్యునరేషన్ కూడా బాగా దక్కింది. మంచి పేరు కూడా వచ్చింది. అమితాబ్ బచ్చన్ అయితే నా స్నేహితుడు కోసం వచ్చాను అంటూ తన సొంత డబ్బులు పెట్టి మరి జెట్ లో వచ్చాడు. 


ఇంకా అనుష్క అలియాస్ స్వీటీ విషయానికొస్తే ఈ సినిమా ఒక చిన్న పాత్రలో కనిపించింది. దాని కోసం ఆమె ఒక్క రూపాయి కూడా అడగలేదట.. ఇస్తున్న ఆమె కూడా తీసుకోలేదట. చిరంజీవిగారంటే నాకు అభిమానం అందుకే నాకొద్దు అని ఆమె వెల్లడించింది.  నిశ్శబ్దం సినిమా షూటింగ్ లో ఉన్న అనుష్క ఈ సినిమాకోసం అమెరికా నుండి వచ్చి మరి ఈ సినిమాలో నటించింది..ఆమె నటిస్తున్న సినిమా త్వరలోనే విడుదల కానుంది 


మరింత సమాచారం తెలుసుకోండి: