పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయినా పవన్ అభిమానులు మాత్రం ఇంకా ఆమెను తమ వదినగా గౌరవిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఢీ డ్యాన్స్ షో లేటెస్ట్ సిరీస్ కు జడ్జిగా ఎంపిక కావడం వెనుక పవన్ పరోక్ష సహకారం లభించింది అని వార్తలు వస్తున్నాయి. 

ఈ షోను ప్రజెంట్ చేస్తున్న మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం రీత్యా రేణు దేశాయ్ ని ఈ షోకు జడ్జిగా ఎంపిక చేసే విషయంలో పవన్ సన్నిహతుడైన ఒక వ్యక్తి రాజకీయం నడిపినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ‘బిగ్ బాస్ 3’ షోకు సంబంధించి హౌస్ మేట గా రేణు దేశాయ్ కి అవకాశం వచ్చినా ఆ అవకాశం తిరస్కరించమని పవన్ స్వయంగా రంగంలోకి దిగి తన కొడుకు అకిరా తో రాయబారాలు చేసినట్లు గాసిప్పులు వినిపడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ పూనా నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యే విషయంలో కూడ అకిరా ఒత్తిడి ప్రభావితం చేసిందని అంటున్నారు. అంతేకాదు తన తండ్రికి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశ్యంతో అకిరా గట్టి పట్టుపట్టి రేణు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యేలా చేసాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. 

‘ఢీ’ సిరీస్ సక్సస్ ను బట్టి రేణు దేశాయ్ మరిన్ని టివి షోలలో పాల్గొనేలా వ్యూహాలు రచిస్తూ ఆమెకు పరోక్షంగా సహకరించాలని పవన్ అభిప్రాయపడుతున్నట్లు టాక్. దీనితో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రేణు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన నేపధ్యంలో ఆమె మరిన్ని బుల్లితెర కార్యక్రమాలలో కనిపించే ఆస్కారం ఉంది. దీనితో పవన్ అభిమానుల సహకారంతో ఈ వదినమ్మ తన సెకండ్ ఇన్నింగ్స్ సమర్ధవంతంగా కొనసాగించే ఆస్కారం కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: