ఇటీవల  మారి 2 తో   ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో ధనుష్ కు ఆ చిత్రం  షాక్ ఇచ్చింది.  ఇక   ఈచిత్రం  తరువాత ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ  'అసురన్' ఈ రోజు  గ్రాండ్ గా విడుదలైయింది.  ఈ చిత్రానికి  క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్  వస్తున్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ నటన, ఇంటర్వెల్ బ్లాక్  సినిమాకు హైలైట్ గా  నిలిచాయని  సమాచారం. వెట్రిమారన్  తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ నటి   మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటించింది.   జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మించాడు.  ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. 



ఇంతకుముందు  వీరి కాంబినేషన్ లో వచ్చిన  వడ చెన్నై కూడా  పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకొని  సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా తరువాత  ప్రస్తుతం  ధనుష్ , దొరై సెంథిల్ కుమార్  డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.  పక్కా మాస్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈచిత్రంలో  స్నేహ  ఓ కీలక పాత్రలో నటిస్తుండగా  టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర  విలన్ పాత్రలో  కనిపించనున్నాడు. 




ప్రస్తుతం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈఏడాది  డిసెంబర్ లో విడుదలకానుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా   దొరై సెంథిల్ కుమార్ , ధనుష్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో  'కోడి' అనే చిత్రం  తెరకెక్కింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: