ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన వడ చెన్నై కూడా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకొని సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం ధనుష్ , దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈఏడాది డిసెంబర్ లో విడుదలకానుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా దొరై సెంథిల్ కుమార్ , ధనుష్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో 'కోడి' అనే చిత్రం తెరకెక్కింది.