సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో తొలిసారి ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, 

అలానే సెకండ్ హాఫ్ లో మంచి యాక్షన్ సీన్స్, ఫైట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ గా సాగుతూ, ఓవర్ ఆల్ గా సినిమా అదరగొడుతుందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో జరిగింది. కాగా తదుపరి షెడ్యూల్ కు కొద్దిపాటి బ్రేక్ ఇచ్చిందట సినిమా యూనిట్. అయితే ఈ బ్రేక్ లో తన ఫ్యామిలీని తీసుకుని సూపర్ స్టార్ దుబాయ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఎప్పటికపుడు సినిమాలతో పాటు, తీరిక సమయాల్లో తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి టూర్స్ వెళ్లే సూపర్ స్టార్ మహేష్, ఈ సారి వేసిన ఈ దుబాయ్ టూర్, ఒక వారం రోజుల వరకు సాగనుందట. ఇక టూర్ నుండి ఆయన తిరిగిరాగానే ఈ నెల ద్వితీయార్ధంలో తాజా షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తన్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తుండగా, నటి సంగీత మరియు కమెడియన్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి కొంత గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: