సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'.   నేటితో ఈ చిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈచిత్రాన్ని   కేవలం 100రోజుల్లోపే  పూర్తి చేయడం  విశేషం.  ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాలను పూర్తి చేసి  చిత్రాన్ని  సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలచేయనున్నారు.



యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్  నయనతార కనిపించనుంది.  వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి ,  ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.  కాగా  మురగదాస్ - రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో  దర్బార్  పై భారీ అంచనాలు వున్నాయి.



ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను  38కోట్లకు  ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకోగా తెలుగు థియేట్రికల్ హక్కులను  ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నడు.  అయితే  కోలీవుడ్ లో పొంగల్ కు ఈచిత్రం దాదాపుగా సోలో గానే  బరిలోకి దిగుతుండగా  తెలుగులో మాత్రం  దర్బార్ కు భారీ పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ , అల.. వైకుంఠపురములో.. చిత్రాలు బరిలో  వున్నాయి.  ఈ చిత్రాలతో పోటీ పడి వసూళ్లను రాబట్టుకోవాలనుకుంటే  దర్బార్ కు  బ్లాక్ బాస్టర్ టాక్ రావాలి.  మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: