మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. పైగా తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. సౌత్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొస్తుంది. 

తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది సైరా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది సైరా నరసింహా రెడ్డి. ఇక ఈ చిత్రాన్ని చూసి తెలుగు ఇండస్ట్రీ పెద్దలతో పాటు మిగిలిన ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా మెగా కుటుంబం నుంచి బన్నీ కూడా సైరా సినిమాను చూసాడు.

కాని ఇప్పటికే ఈ కుటుంబం అంతా సినిమా చూసారు. సుదర్శన్ థియేటర్‌లో మెగా ఫ్యామిలీ అంతా వచ్చి తొలిరోజే సినిమా చూసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ , అల్లు అర్జున్ దక్షిణాది సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.కాని సైరా సినిమా ఫంక్షన్‌కి రానందుకు, ఆ సినిమా ట్రైలర్ పై స్పందించనoదుకు మెగా ఫ్యాన్స్ బన్నీని ఒక రేంజ్‌లో ఏకేస్తున్నారు. సినీలోకమంతా అద్భుతం అని పొగుడుతున్న సినిమాని స్వయానా కుటుంబసభ్యుడే పట్టించుకోకపోవడంతో అంతా బన్నీని ట్రోల్ చెయ్యడంతో బన్నీ రియాక్ట్ అయ్యాడు.

బన్నీ కూడా ఏఎంబి సినిమాస్‌లో సైరా సినిమాను చూసాడు. కుటుంబంతో వచ్చి మెగా సినిమాను ఎంజాయ్ చేసాడు స్టైలిష్ స్టార్. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి.. కుమారుడు అయాన్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి నటనకు ఫిదా అయిపోయాడు అల్లు అర్జున్. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు బన్నీ.


మరింత సమాచారం తెలుసుకోండి: