మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' బుధవారం విడుదలై సంగతి తెలిసిందే.సైరా సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. పైగా తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా పండగ చేసుకుంటున్నారు. వెండితెరపై చిరంజీవి నట విశ్వరూపానికి ముగ్దులైపోయామని చాలామంది ఫ్యాన్స్ చెప్పారు. సైరా నరసింహారెడ్డి సక్సెస్‌తో చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సినిమా సక్సెస్‌ పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు.చిరంజీవి కుటుంబ సభ్యులు,ఇండస్ట్రీ పెద్దలు కూడా మొదటిరోజే సినిమా చూసి అద్భుతం అంటూ కొనియాడారు.

సైరాకు వచ్చిన స్పందనతో మెగా అభిమానులు,శ్రీకాంత్ వంటి నటులు ఆయన ఇంటి వద్ద టపాసులు కాల్చి సంబరాలు కూడా జరుపుకున్నారు. సైరా ఫీవర్‌తో అభిమానులంతా ఊగిపోతున్నవేళ.. మెగా బ్రదర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సినిమాపై ఏమీ మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పవన్ కల్యాణ్ సైరా సినిమా చూడకపోవడం వల్లే స్పందించలేదని తెలుస్తోంది. అయితే సినిమా చూడకపోవడానికి కారణం వేరే ఉంది. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన.. కేరళ ఆయుర్వేద పద్దతిలో చికిత్స తీసుకుంటున్నారట. ఇద్దరు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్టు సమాచారం.ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందట. అప్పటివరకు పవన్ కల్యాణ్ విశ్రాంతిలోనే ఉండటం తప్పనిసరి. ఈ కారణం చేతనే సైరా సినిమా చూడలేకపోయారని అంటున్నారు. ఏదేమైనా సినిమాలో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఉండటం..సైరా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం..తో మెగా అభిమానులంతా సంబరాల్లో మునిగిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: