సైరా నర్సింహారెడ్డి విజయంతో  మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది  చిత్ర బంధం. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కలిసి బిగ్ పార్టీ చేసుకున్నారు. అయితే ఈ పార్టీని అల్లు ఫ్యామిలీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా  ఈ పార్టీలో కుర్ర హీరోలతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి సినిమా విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినీ కెరీర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక సినిమాగా  భారీ బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను... దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.

 

 

 

 

 కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో  రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. అయితే విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన సినిమా... విడుదలైన తర్వాత ప్రేక్షకులక అంచనాలకు మించి ఉందంటూ పేరు తెచ్చుకుంటుంది. కథా నేపథ్యం పరంగా మంచి టాక్  రావడమే కాదు... భారీ వసూళ్లు  కూడా రాబడుతు రికార్డులు సృష్టిస్తుంది సైరా నరసింహారెడ్డి. అయితే ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం చూసిన  మెగా అభిమానులు దసరా పండగ ముందుగానే చేసుకున్నారు. 

 

 

 

 

 అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇక ఇప్పుడు సైరా నర్సింహారెడ్డి సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఓ పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.అల్లు ఫ్యామిలీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో  చిరంజీవి యువ హీరోలతో చాలా జోష్ ఫుల్ గా గడిపారు.కాగా యువ  హీరోలందరూ మెగాస్టార్ చిరంజీవి కి కంగ్రాట్స్ తెలిపారు. అల్లు ఫ్యామిలీ  ఏర్పాటుచేసిన  బిగ్ పార్టీ కి... మెగా ఫ్యామిలీయే  కాక హీరోలు  అఖిల్, శ్రీకాంత్ దర్శకులు వంశీ పైడిపల్లి సురేందర్ రెడ్డి,  హరీష్ శంకర్, త్రివిక్రమ్ సహా పలువురు దర్శక నిర్మాతలు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: