హీరోగానే కాదు నిర్మాతగా కూడా రాం చరణ్ తన సత్తా చాటుతున్నాడు. తనని హీరోని చేసిన తండ్రి కలను నెరవేర్చేందుకు రాం చరణ్
సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించాడు. సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించడమే కాకుండా భారీ తారాగణం కూడా ఉండేలా చూసుకున్నాడు.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన
సైరా సినిమాలో నటుడు బ్రహాజికి గుండు కొట్టించేశాడు నిర్మాత రాం చరణ్.
పాత్ర కోసం ఏదైనా చేసే
బ్రహ్మాజి సైరాలో నరసింహా రెడ్డికి రైట్ హ్యాండ్ పాత్రలో నటించాడు. అందుకు సినిమాలో ఓ సీన్ లో గుండుతో కనిపించాల్సి ఉండగా నిజంగానే
బ్రహ్మాజి ఆ సీన్ లో గుండు కొట్టించుకున్నాడట. రాం చరణ్ కూడా
బ్రహ్మాజి నిజంగా గుండు కొట్టించుకోవడం చూసి షాక్ అయ్యాడట.
అలా పాత్రకు కావాల్సిన విధానంలో కనిపించేలా దేనికైనా రెడీ అంటారు కాబట్టే
బ్రహ్మాజి ఇప్పటికి బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఇక సినిమాలో అమితాబ్, సుదీప్,
విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ కు కూడా మంచి రోల్స్ రాలేదని ఆయా హీరోల ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో జగపతి బాబు కూడా తమని కాస్ట్ లీ జూనియర్ ఆర్టిస్టులను చేశాడంటూ చరణ్ మీద పంచ్ వేశాడు.
ఏది ఏమైనా
సైరా సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. అయితే ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నా మెగా కాంపౌండ్ మాత్రం చాలా సంతోషంగా ఉంది. కలక్షన్స్ కన్నా సినిమాకు వచ్చిన టాక్ తో వారు ఖుషిగా ఉన్నారు. ఈ వయసులో కూడా
చిరంజీవి చేసిన ఈ సాహసానికి మెగా ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగితేలుతున్నారు.