సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ ని యంగ్ హీరోలు కూడా అందుకోలేకపోతున్నారు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటు వెళుతున్నారు. కబాలి, కాలా, పేట సినిమాలు రజనీ ఇమేజ్ కి ధీటుగా భారీ అంచనాలతో రిలీజయ్యాయి. కానీ ఈ మూడు సినిమాలు యావరేజ్ గానే నిలిచాయి. ఇక తెలుగులో డబ్ చేయగా ఫ్యాన్స్ ని నిరాశపరచాయి. అయితే రజని రాకకోసం అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. అందుకే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రజనీ సిద్దమవుతున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ - ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'దర్బార్'. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ పోలీసు గెటప్ కు సంబంధించిన ఫోటోలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతేకాదు రజనీ చాలా సంవత్సరాల తర్వాత పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది.

తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను చిత్ర బృందం ఇచ్చారు. ఈ సినిమాలో రజనీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారట. అంతేకాదు 'దర్బార్' షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉందని తెలుస్తోంది. 2020 సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోందని కోలీవుడ్ మీడియా సమాచారం.  

ఈ సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్నారు. నివేద థామస్.. యోగిబాబు.. ప్రతీక్ బాబ్బార్.. నవాబ్ షా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ పా.రంజిత్ తో ఒక సినిమా అలాగే మరో ఇద్దరి దర్శకులతోను తన తర్వాత ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. ఇక ఇప్పటికే రజనీ-పా.రంజిత్ కాంబినేషన్లో కబాలి, కాలా వచ్చిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: