ఒకప్పుడు నటుడిగా కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సినిమాలను నిర్మించారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్... పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టి పెద్ద నిర్మాతగా మారాడు. అయితే నిర్మాతగా మారిన తర్వాత బండ్ల గణేష్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. చెక్ బౌన్స్ కేసులు అప్పట్లో బండ్ల గణేష్ చిక్కుకున్నారు. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్ పై మరో కేసు నమోదైంది. 

 

 

 

 

 టాలీవుడ్ నిర్మాత వైసిపి నేత పివిసి... బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు. అయితే టాలీవుడ్ నిర్మాతలైన  బండ్ల గణేష్ పీవీసీ  మధ్య  గత రెండేళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హిట్ మూవీ టెంపర్ సినిమా కు పివిసి ఏడు కోట్ల ఫైనాన్స్ ని వల్ల గణేష్ కి  అందించగా... బండ్ల గణేష్ అది ఇప్పుడు వరకు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వమని బండ్ల గణేష్ ని  అడిగినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు నిర్మాత పివిసి. 

 

 

 

 

 

 అయితే ఈ నేపథ్యంలో గత రాత్రి పీవీసీ  ఇంటిపై నిర్మాత బండ్ల గణేష్,  ఆయన అనుచరులు దాడి చేసి పీవీసీ  కుటుంబీకులను బెదిరించారు. ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు పీవీసీ . నిర్మాత బండ్ల గణేష్ సహా అతని అనుచరులు నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు బండ్ల గణేష్ ని అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి కార్యాలయానికి వెళ్లగా  అక్కడ ఆయన  అందుబాటులో లేకపోవడంతో... బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు భావించిన పోలీసులు... బండ్ల గణేష్  ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్ ను  నియమించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

 

 

 

ఇదిలా ఉండగా తాజాగా నిర్మాత నటుడు బండ్ల గణేష్ జూబ్లీహిల్స్ పోలీసులు ఆశ్రయించాడు. తనను పీవీసీ  హత్య చేస్తాడని తనకు రక్షణ కల్పించాలని బండ్ల గణేష్ ఆరోపించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు బండ్ల గణేష్. పీవీసీ  అనుచరులు  తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని... తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బండ్ల గణేష్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: