మాములుగా ఎవరైనా పెళ్ళంటే ఒక నెల ముందు నుండి తెగ హంగామా చేస్తుంటారు. ఎందుకంటే పెళ్లి అనేది జీవితంలో ఒక సారి మాత్రమే వచ్చే ఘట్టం. అందుకే చాలా ఘనంగా చేసుకుంటారు. ఇకపోతే పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ఎవరితో రాసిపెట్టింటే వారితోనే పెళ్లి జరుగుతుంది. మాములు వాళ్ళు పెళ్లి అంటే ఉన్నంతలో మాత్రమే చేసుకుంటారు. 


అదే సెలెబ్రెటీల విషయానికొస్తే.. ముందు నుండి ప్రేమయాణంలో ఉండి సహజీవనం చేసి రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకోవాలంటే చేసుకుంటారు లేదంటే బ్రేకప్ చెప్పి మళ్ళీ సినిమాలల్లో నటిస్తుంటారు. ప్రేమ వరకు వెళ్లిన ఈ మధ్య ప్రేమ జంటలు అంటే విరుష్క , రణవీర్ దీపిక , ప్రియాంక జోనష్ లు వస్తారు. 


ఇకపోతే ప్రియాంక చోప్రా తన పెళ్లి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే.. తన పెళ్లికి తానే పనోడయ్యాడు నిక్ అంటూ ఆమె వెల్లడించింది.  బ్రిటిష్ అబ్బాయి అయిన నిక్ ఒక పాప్ సింగర్ . ప్రేమలో చాలా కాలంలో గడిపిన వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ లో వివాహంతో ఒక్కటయ్యారు.



విషయానికొస్తే.. ప్రియాంక మూడేళ్ళ తర్వాత మళ్లీ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ది స్కై ఈజ్ పింక్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్ లో బిజీగా ప్రముఖ కార్యక్రమాల్లో హాజరయ్యి సందడి చేస్తూ వస్తుంది. ఆ సందర్భంగా కపిలశర్మ షో తన పెళ్లి గురించి వెల్లడించింది. నిక్ పెళ్ళికొసం ఇండియా కోచి గ్యాస్ సిలిండర్ లు దగ్గర నుండి అన్ని పనులు తానే చూసుకున్నాడు. మళ్లీ అతని ప్రేమలో పడిపోయాను అంటూ ఈ బ్యూటీ వెల్లడించింది.. ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: