టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా, యువ దర్శకుడు తిరు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవి చాణక్య నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గోపీచంద్ సరసన మెహ్రీన్, మరియు బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామ బ్రహ్మం నిర్మించడం జరిగింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సారథ్యంలోని ఈ సినిమా సాంగ్స్ కు అలానే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై బాగా అంచనాలు కూడా ఏర్పడ్డాయి. 

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇండియా మరియు పాకిస్థాన్ బోర్డర్ ప్రాంతంలో అత్యధిక శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఒక చిన్న పాయింట్ ని తన కథకు బేస్ గా తీసుకున్న దర్శకుడు తిరు, దానిని ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా అద్భుతంగా తెరకెక్కించి పూర్తిగా సఫలయమయ్యారట. ముఖ్యంగా యాక్షన్, ఫైట్స్ మరియు ఛేజింగ్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్స్, సాంగ్స్, 

మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఇక నటుడు నాజర్ మరియు మరొక నటుడు రాజేష్ ఖత్తర్ ఎంతో అద్భుతంగా నటించినట్లు చెప్తున్నారు. భారత్ తరపున పని చేసే ఒక అండర్ కవర్ రా ఏజెంట్ పాత్రను ఈ సినిమాలో గోపీచంద్ పోషించడం జరిగిందట. ఇక హీరోయిన్లు ఇద్దరూ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటించి మెప్పించారట. ఓవర్ ఆల్ గా అన్ని ప్రాంతాల నుండి అందుతున్న రిపోర్టులను  బట్టి చూస్తుంటే చాలా ఏళ్ళ తరువాత మళ్ళి గోపిచంద్ ఖాతాలో చాణక్య రూపంలో మంచి హిట్ పడిందని అంటున్నారు సినిమా విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: