పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యాడు.  సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు.  మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 25 సినిమాలు చేయగా అందులో చాలా వరకు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  పవన్ ఒకసారి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే.. ఆ వ్యక్తులతో లాంగ్ టైమ్ పవన్ ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు.  


ఇందుకు ఓ ఉదాహరణ త్రివిక్రమ్ శ్రీనివాస్.  ఇద్దరు కలిసి జల్సా సినిమా చేశారు.  ఆ సినిమా సూపర్ హిట్టైంది.  అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యింది.  సినిమా హిట్ కావడంతో మరో సినిమా చేయడానికి కొంత సమయం తీసుకున్నారు.  కానీ, పవన్.. త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం కాలేదు.  ఇదిలా ఉంటె ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను చూసి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. మరలా ఇద్దరు కలిసి అత్తారింటికి దారేది సినిమా చేశారు.  


ఇది బంపర్ హిట్ అయ్యింది.  కాగా, ఈ మూవీ తరువాత పవన్ 25 వ సినిమా అజ్ఞాతవాసి మాత్రం దారుణంగా పరాజయం పాలైంది.  కానీ, త్రివిక్రమ్.. పవన్ ల మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం తగ్గలేదు.  ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాతో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ ప్రొడ్యూసర్ అయ్యారు.  గోపాల గోపాల మంచి విజయం సాధించింది.  


ఈ మూవీ తరువాత శరత్ మరార్ సర్దార్ గబ్బర్ సింగ్ తీశాడు.  ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు కావడంతో సినిమాకు లాస్ వచ్చినా.. శరత్ మరార్ కు పెద్దగా నష్టాలు రాలేదు.  అయితే, కాటంరాయుడు సినిమాతో శరత్ మరార్ కు నష్టాలు వచ్చాయి.  ఆ తరువాత శరత్ మరార్ సినిమాలు నిర్మించలేదు.  డబ్బింగ్ సినిమాలు చేసిన కలిసి రాలేదు.  


అయితే, ఈ స్టార్ ప్రొడ్యూసర్ సడెన్ గా సైరా ప్రమోషన్ కార్యక్రమంలో మెరిశాడు.  ముంబై ప్రమోషన్ కార్యక్రమంలో కనిపించి సందడి చేసిన శరత్ మరార్, చిరంజీవి అక్కడ ఉన్నంత సేపు మెగాస్టార్ తోనే ఉన్నారు.. వాళ్లతో కలిసి ముంబై నుంచి హైదరాబాద్ కు చార్టెడ్ ఫ్లైట్ లోనే వచ్చారు.  ఇలా పవన్ ను పక్కన పెట్టి పవన్ కు దూరంగా ఉంటున్న శరత్ మరార్ మెగాస్టార్ తో చనువుగా ఎందుకు ఉన్నాడు. భవిష్యత్తులో మెగాస్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడా లేదంటే.. పవన్ తో మరలా దగ్గరయ్యేందుకు మెగాస్టార్ కు దగ్గరవుతున్నాడా.. చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: