తెలుగు లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పూజా హెగ్డే..ఈ మూవీస్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపించింది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా..లాంగా ఓణి, చిర కట్టుతో కనిపించింది.  అయితే పూజా హెగ్డే అందం ఈ మూవీస్ తో అడవికాచిన వెన్నెల్లా మారిపోయింది.  దాంతో ఆమెకు వెంటనే ఏ సినిమా ఛాన్సులు రాలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన ‘మొహంజదారో’ మూవీలో నటించింది. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. 


ఇదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడజగన్నాథం’ సినిమాలో హాట్ లుక్స్ తో కనిపించింది.  ముఖ్యంగా బికినీ సీన్లో పూజా హెగ్డే రెచ్చిపోయి నటించింది.  దాంతో ఈ అమ్మడికి అదృష్టం తలుపు తట్టింది. వరుస సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఎన్టీఆర్, మహేష్ బాబు సరసన నటించిన పూజా హెగ్డే ప్రస్తుతం త్రివిక్రమ్-బన్ని కాంబినేషన్ లో వస్తున్న ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తుంది.  ఈ మద్య వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్ ’ పూజా హెగ్డే చాలా సాంప్రదాయంగా కనిపించింది. 

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పూజా హెగ్డే తాజాగా  మహారాష్ట్రంలో చెట్ల నరికివేత దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌‌గా మారింది. సోషల్ మీడియాలో చాలామంది చెట్ల నరికివేతపై మహా సర్కార్‌తో పాటు మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. నా మనసు ఎంతగానో గాయపడింది. ఇది చాలా దారుణం.


మన జీవనాధారం చెట్లని మనం ఎప్పుడు గ్రహిస్తాం? మెట్రో, పార్కింగ్ స్థలాలు చెట్ల కన్నా ముఖ్యమైనవి కాదు. హారిబుల్.. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కోడ్ చేస్తూ ఆమె ట్విట్టర్‌లో పూజా పోస్టు పెట్టింది.  కేవలం కారు షెడ్ల కోసం  అరే కాలనీలో  శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాల‌ను న‌రికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ విషయం విన్న తర్వాత నా గుండె పగిలిపోయిందని ఆవేదన చెందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: