గత సంవత్సరం వరుస ఫ్లాపులు వచ్చి బాగా డిసప్పాయింట్ మెంట్ తో ఉన్న యంగ్ హీరో నితిన్ కు బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి వరుసగా 4-5 సినిమాలనే లైన్లో పెట్టాడు. ఒక వైపు వెంకీ కుడుముల 'భీష్మ' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కాకుండా కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా.. వెంకీ అట్లూరితో 'రంగ్ దే' అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా కూడా క్యూలో ఉందని తెలుస్తోంది.

'భీష్మ' షూటింగ్ పూర్తి కాగానే చంద్రశేఖర్ యేలేటి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తాజా సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఆనంద్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాకి 'చదరంగం' అనే టైటిల్ ని పెట్టాలని చిత్ర బృందం అనుకుంటున్నారట. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే ఈ టైటిల్ పెడుతున్నారని తాజా సమాచారం. యేలేటి సినిమాలన్నీ మిస్టరీ బ్యాగ్డ్రాప్, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించే కథలు అన్న విషయం తెలిసిందే. అలాగే 'చదరంగం' కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒక కథానాయిక కాగా ప్రియా ప్రకాష్ వారియర్ రెండో కథానాయకిగా కనిపించనుంది. అయితే హీరోయిన్ విషయంలోను మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వచ్చి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కొత్త అమ్మాయి సిమ్రాన్ చౌదరిని ఎంపిక చేశారట. అయితే ఈ సినిమాను లాంచ్ చేసినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా ప్రకాష్ వారియర్ ను హీరోయిన్లుగా ప్రకటించారు. 'చదరంగం' గా టైటిల్ ని అనుకుంటున్నారు కానీ సిమ్రాన్ చౌదరిని మూడవ హీరోయిన్ గా ఎంపిక చేశారా లేదా.. రకుల్, ప్రియాలలో ఒకరిని రీ ప్లేస్ చేయబోతున్నారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: