సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ సరిలేరు నీకెవ్వరూ. ఇక ఎఫ్-2 వంటి 100 కోట్లు కలెక్ట్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి మహేష్ తో తెరకెక్కిస్తున్న సరిలేరు సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి శరవేగంగా షూటింగ్ జరుగుతూ చిన్న బ్రేక్ రావడంతో మహేష్ తన పిల్లలతో కలిసి దసరా వెకేషన్ కి వెళ్లారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ దాదాపు 75శాతం పూర్తి చేశారని తాజా సమాచారం. ఇటీవల కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పోరాటాలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో చిత్రీకరించిన చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 

ఇక కేవలం కొన్ని సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ చేయాల్సి వుందని చిత్ర యూనిట్ నుంచి అందిన తాజా అప్‌డేట్. ఇక అసలు విషయం ఏమిటంటే 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ టీజర్ ని దీపావళి కానుకగా నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాకి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీతో లేడీ అమితాబ్ విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుండగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మనందం, సంగీత తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేష్ కి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించారు. 

గద్దలకొండ గణేష్ సినిమాలో శ్రీదేవి గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన పూజా కి మంచి పేరే వచ్చింది. ఇక చేసింది చిన్న పాత్రే అయినా పారితోషకం భారీగా ముట్టజెప్పారట. అలాగే సరిలేరు లోను చిన్న పాత్ర అయినప్పటికి పూజా కి ఉన్న క్రేజ్ దృష్ట్యా రెమ్యునిరేషన్ బాగానే  ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో విజయశాంతికి భారీగా రెమ్యునిరేషన్ ఇస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాతో పాటు 2020 సంక్రాంతి బరిలో అల్లు అర్జున్-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో అల వైకుంఠపురములో, నందమూరి కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా, సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ దిగనున్నాయి. మరి ఈ బరిలో నెగ్గేదెవరో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: