సీనియర్ ఫిలింమేకర్ తమ్మారెడ్డి భరద్వాజ గత కొంతకాలంగా సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా 'నా ఆలోచన' పేరుతో తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అటు పొలిటిక్ల్గాను, ఇటు సినిమాలపైన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఆయన చేస్తోన్న కామెంట్లపై ఎలాంటి విమర్శలు వస్తున్నా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. కొందరు రాజకీయ నాయకులను సైతం ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్
చిరంజీవి సైరా సినిమాపై సైతం స్పందించారు.
సైరా గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ యావరేజ్ టాక్ వచ్చినా సాహోనే రు.300 కోట్ల వరకకు కలెక్షన్లు సాధించింది. ఇక
సైరా నరసింహారెడ్డికి ఇంకా బెటర్ క్యాస్టింగ్ ఉంది. అన్ని భాషల నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా గ్యారెంటీగా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది... ఐదు రోజుల లాంగ్ వీకెండ్తో ఐదు రోజుల్లోనే రు.300 కోట్లు కలెక్ట్ చేస్తుందా ? లేదా రు.500 కోట్లు కలెక్ట్ చేస్తుందా ? లేదా రూ.1000 కోట్లు సాధిస్తుందా ? అన్నది చూడాలని చెప్పారు.
ఇక సాహోలాగానే ఈ సినిమాకు రు.200 టిక్కెట్ సాహోలాగానే పెట్టడంతో ... మరి కలెక్షన్ 300 కోట్ల దగ్గరే ఆగుతుందా.. లేదా 1000 కోట్లు టచ్ చేస్తుందా.. అదీ కాదంటే బాహుబలి లాగా 2000 కోట్లు మార్క్ చేరుతుందా చూద్దాం అని తమ్మారెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే తమ్మారెడ్డి
సైరా టిక్కెట్ల రేట్లు పెంపు.. ఆ సినిమా కలెక్షన్ల గురించి కాస్త వ్యగ్యంగా మాట్లాడినట్టే కనపడుతోంది. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చాలామంది మెగా ఫ్యాన్సుకు నచ్చలేదు. గతంలోనే తమ్మారెడ్డి 'అమ్మడు కుమ్ముడు' సాంగ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
ఈ సారి
సైరా సినిమా ఎలా ఉందన్నది మాట్లాడకుండా కేవలం రెండు నిమిషాల పాటు కలెక్షన్లనే టార్గెట్గా చేసుకుని మాట్లాడి తన స్థాయిని తగ్గించుకున్నారని.. చిరుపై ఆయన కడుపుమంట బయటపెట్టుకున్నారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆయన డైలాగుల్లో డబుల్ మీనింగ్ ఉందని కొందరు ఫైర్ అవుతున్నారు.