బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా రియల్ హీరోస్ కథతో వస్తుంది. 2020 జూలై 30న ఎట్టిపరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత రాజమౌళి కొద్దిపాటి గ్యాప్ తో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. రాజమౌళి, మహేష్ కాంబో మూవీ ఎప్పుడో సెట్ అవ్వాల్సింది కాన్ని ఇప్పటికి అది కుదరలేదు. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత జక్కన్న మహేష్ సినిమానే ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. కె.ఎల్. నారాయణ ఈ సినిమా నిర్మిస్తారట.


బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో బాలీవుడ్ ను టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ అందుకోవాలని చూస్తున్నాడు. అసలే మహేష్ హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అందుకే జేమ్స్ బాండ్ తరహాలో రాజమౌళి సినిమా ఉంటుందట. సినిమా టేకింగ్, స్టోరీ ఇవన్ని హాలీవుడ్ సినిమాలా ప్లాన్ చేస్తున్నారట. మహేష్ కూడా రాజమౌళి సినిమాపై చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు.  ఏ సినిమా అయినా సరే తన రేంజ్ చూపించే రాజమౌళి మహేష్ సినిమాను కూడా అంచనాలకు తగినట్టుగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.  


ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మరో సినిమా చేశాక రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయశాంతి కూడా స్పెషల్ రోల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: