వరుసగా మూడు సినిమాలు హిట్ అయినా గాని ఒకే డైరెక్టర్ తో చేసిన మూడు సినిమాలు హిట్ అయినా గాని హ్యాట్రిక్ అంటారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ చుట్టూ ముగ్గురు హీరోల కెరీర్లు నడుస్తున్నాయి. వారెవరో కాదు మహేష్ బాబు, అల్లు అర్జున్, బాలయ్య బాబు. ముందుగా మహేష్ బాబు విషయానికి వస్తే భరత్ అనే నేను సినిమా మరియు మహర్షి సినిమాలతో రెండు అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం మహేష్ చాలా కష్టపడుతున్నారు.


ఎలాగైనా హ్యాట్రిక్ విజయాలు సాధించాలని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపోతే అల్లుఅర్జున్ విషయానికొస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గతంలో చేసిన రెండు సినిమాలు..సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలు సాధించాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్న అలా వైకుంఠపురం లో అనే సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకునే టానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా 'నా పేరు సూర్య' సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ పై మళ్లీ ఎక్కడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ.


దీంతో మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు రాబోయే సంక్రాంతిని టార్గెట్ పెట్టుకుని షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. మరి వీరిద్దరిలో రాబోయే సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టేది ఎవరో చూడాలి. మరోపక్క నందమూరి బాలకృష్ణ బోయపాటితో మూడో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లెజెండ్ సింహా సినిమాలు విడుదలయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాయి. మరి ఈ సారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో...హ్యాట్రిక్ విజయం అందుకుంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: