దక్షిణాది భారత దేశంలో లేడీ సూపర్‌స్టార్‌ అని అభిమానులు నయనతారకిచ్చిన పట్టం ఇది. అందుకు తగిన విధంగానే  ఈ సంచలన నటి తన స్టార్‌డంను పెంచుకుంటూపోతోంది. మొదట్లో నయనతారకు గ్లామర్‌ పాత్రలే తలుపు కొట్టేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారి నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఎక్కవుగా వరిస్తున్నాయి.

ఇకపోతే ఈ అందాల భామ పై వచ్చినన్ని వదంతులు, తను ఎదురొడ్డిన ఎదురీతలు చాలానే చెప్పుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగతంగానే పలు విమర్శలను ఎదుర్కొంటోంది ఈ కేరళ కుట్టి. అందులో ఒకటి నయనతార తన చిత్రాల ప్రారంభోత్సవాల్లోనూ, చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనదనేది. కాని ఇది నిజమే ఈ అమ్మడు తను నటించిన ఏ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు రాదు. 


అది ఎంత పెద్ద సినిమా అయినా, చివరికి సొంత చిత్రం అయినా కావచ్చు. అలాంటిది ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన బిగిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననుందనే ప్రచారం బాగా జరిగింది. అంతే కాదు, తెలుగులో భారీ సినిమా అయిన చిరంజీవికి జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రచార కార్యక్రమానికి యథాతథంగా నయనతార ఎగుర కొట్టింది. అంత వరకూ ఎందుకు తాను తన ప్రియుడిని నిర్మాతగా చేస్తూ నిర్మిస్తున్న నెట్రికన్‌ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా తాను హాజరు కాలేదు. 


దీంతో తన చిత్ర ప్రారంభోత్సవానికి రాకపోవడం ఏమిటీ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు విషయాన్ని నయనతార తన సన్నిహితుల వద్ద చెప్పుకుని చింతించిందంట. తాను ఏ చిత్ర  ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆ చిత్రాలు బాగా ఆడలేదని చెప్పుకుందంట. ఆ సెంటిమెంట్‌ కారణంగానే తానీ చిత్ర ప్రారంభోత్సవాల్లోనూ, ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని అసలు విషయాన్ని బయటపెట్టింది ఈ కాలేరు ముద్దు గుమ్మ. దీంతో నయనతార కూడా ఇంత సెంటిమెంటల్‌ ఉమెన్‌నా అంటూ చాలా మంది ఆశ్యర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: