ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఉన్న అల్లుల్లుగా  వెంకటేశ్, వరుణ్ తేజ్ హిట్ కొట్టారు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా  తమన్నా మెహరీన్ కౌర్ లు  హీరోయిన్ లు గా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించ గా... దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో ఫన్ అండ్  ఫ్రస్టేషన్  ఉన్న ఇద్దరు అల్లుడిగా వెంకటేష్ వరుణ్ తేజ్ చింపేసారు. 

 

 

 

 

 వెంకటేష్, వరుణ్ తేజ్ ల  కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులందరూ పడి పడి నవ్వుకున్నారు. కాగా ఈ సినిమా స్టొరీ కి చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. అయితే సినిమా హాలులో  నవ్వుల పువ్వులు పోయించి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది ఎఫ్ 2 సినిమా. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు యఫ్2 మేనియా  నడిచింది. సినిమాలో  వెంకటేష్ చెప్పిన అంతేగా అంతేగా అనే డైలాగ్ మాత్రం ప్రేక్షకులు ఊతపదంగా  మారిపోయింది. 

 

 

 

 

 అయితే తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గోవాలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో  ప్రదర్శించే సినిమాల జాబితాలో  ఎఫ్ 2 సినిమా ఎంపికైంది. ఈనెల 20 నుంచి 28 వరకు ఆరు దేశాలకు చెందిన 250 సినిమాలు ఇక్కడ  ప్రదర్శించనున్నారు. కాగా 26 ఫీచర్ ఫిలిమ్స్,  15 నాన్  పీచర్  ఫిలిమ్స్ ఇందులో ప్రదర్శితం కానున్నాయి .కాగా  26 ఫీచర్ ఫిలిమ్స్ లో భాగంగా టాలీవుడ్ నుండి ఎఫ్ 2 ఎంపిక కావడం విశేషం. ఈ వేడుకకు వివిధ దేశాలకు చెందిన 10 వేల మంది  ప్రతినిధులు హాజరవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: