ఝుమ్మంది నాధం సినిమా తో తెలుగులో అరంగేట్రం చేసిన తాప్సి కి ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. ప్రభాస్ సరసన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఈ అమ్మడు ముద్దు ముద్దు మాటలతో మ్యాగీ పాత్రలో ఎంతగానో ఒడిగిపోయారు. ఇలాంటి పాత్రలు ఎన్నో కుర్రకారు మదిలో అలా ఉండిపోయాయి. 

ఒక్క టాలివుడ్ ఏ కాదు బాలీవుడ్ లోను అమ్మడి స్థానం ప్రత్యేకం. ఇప్పుడు ఇమెకున్న క్రేజ్ ఉపరాష్ట్రపతి సైతం మెచ్చుకునేంత లా పాకాయి.

బాలీవుడ్ లో ఈమె  తుషార్ హీరానదని దర్శకత్వం వహించిన 'సాండ్ కీ ఆంఖ్' చిత్రం లో 60 ఏళ్ల బామ్మగా కనిపించారు. అనురాగ్ కశ్యప్ నిర్మించిన ఈ చిత్రంలో ఈమె అలరించిన తీరు శ్రీ.వెంకయ్య నాయుడు సైతం మెచ్చుకునేంత అద్భుతమైనది.

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'సాండ్ కీ ఆంఖ్' చిత్ర బృందం వారు శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడు గార్ని కలిసి చిత్ర విశేషాలను వివరించారు. ఈ మూవీ యూనిట్ సభ్యులు నాయుడు గారితో ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. అనంతరం వారితో కలిసి 'సాండ్ కీ ఆంఖ్' చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కి వెంకయ్య గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమాను బాగా తీశారని,మహిళా సాధికారతను చక్కగా చూపించారని కొనియాడారు. ఉపరాష్ట్రపతి ని కలిసిన వారిలో చిత్ర యూనిట్‌తో పాటు 60 ఏళ్ల మహిళా షార్ప్ షూటర్స్ - చంద్రో తోమర్, ప్రకాశి తోమర్ కూడా ఉన్నారు.

తొలిసారిగా మన ముద్దుగుమ్మ తాప్సి 60ఏళ్ల బామ్మ ల ఎంతో ఒదిగి నటించారు. ఇలాంటి ఒక పాత్ర సాహసమనే చెప్పుకోవాలి. కొన్ని కొన్ని సన్నివేశాలలో నటించింది తాప్సి ఏ నా అనేంత అద్భుతాన్ని కనపరచడం ఒక విశేషం. అత్యంత ప్రజాదరణ ఈ చిత్రం పొందాలని..,, మన తాప్సి ఇలాంటి ఎన్నో విభన్నమైన పాత్రలు పోషించాలని..,,, చిత్రాన్ని తెరకెక్కించిన బృందాన్ని., మన తాప్సిని  మనస్ఫూర్తిగా అభినందిస్తూ., శుభాకాంక్షలు తెలుపుకుందాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: