బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. తెలుగు సినిమా స్థాయేంటో బాహుబలితో చూపించిన జక్కన్న ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. సినిమాలో అల్లూరిగా చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్నారు. సినిమాలో ఈ ఇద్దరు ఎవరికి వారు తమ సత్తా చాటేలా నటిస్తున్నారట.  


అంతేకాదు సినిమాలో ఈ ఇద్దరు కలిసె సీన్ మాత్రం మాములుగా ఉండదని చెబుతున్నారు. సినిమాలో ఆ సీన్ లో ఒక పాప కోసం తారక్ తన ప్రాణం సైతం లెక్క చేయకుండా అడ్డుపడతాడట. ఈ క్రమంలో అల్లూరిగా నటించే రాం చరణ్ కు తారక్ మీద నమ్మకం కుదురుతుందట. అదే సినిమాకు హైలెట్ పాయింట్ అని తెలుస్తుంది.


ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ షూట్ లో రాం చరణ్ ను తొక్కుకుంటూ జనాలు వెళ్లే సీన్ గురించి చిరంజీవి రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఇప్పుడు తారక్, చరణ్ ఇద్దరు కలిసే సీన్ గురించి వచ్చిన న్యూస్ మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ మరో అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క హీరో ఉంటేనే అద్భుతాలు సృష్టించే రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని మెగా నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.  


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.  బాహుబలితో బాలీవుడ్ లో ఏ సినిమా సాధించని రికార్డులు సృష్టించిన  రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి అక్కడ రికార్డుల మీద కన్నేశాడు. సినిమా బిజినెస్ కూడా సినిమా రేంజ్ కు తగినట్టే జరుగుతుందని తెలుస్తుంది.      



మరింత సమాచారం తెలుసుకోండి: