విభిన్న కథా చిత్రాలని తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఆయన పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆదరణ పొందలేదు. తాజాగా ఆవిరి అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు .
`అల్లరి`, `నచ్చావులే`, `అనసూయ`, `అవును`, `అవును 2` ..వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో దర్శకుడిగా రవిబాబు తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత రవిబాబు మాట్లాడుతూ ``రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా,థ్రిల్లింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది`` అన్నారు.
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్, యాక్షన్: సతీశ్,కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి,
మ్యూజిక్: వైధి, స్క్రీన్ప్లే: సత్యానంద్, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.విభిన్న కథా చిత్రాలని తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. ఆయన పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆదరణ పొందలేదు. తాజాగా ఆవిరి అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు .