11 వారాల ముగించుకుని 12వ వారం లోకి అడుగుపెట్టింది తెలుగు బిగ్ బాస్ సీజన్ 3. ఈ క్రమంలో ఈవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో భాగంగా పునర్నవి ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఉన్న రాహుల్ గుక్కపెట్టి ఏడవటం జరిగింది. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులంతా షాకయ్యారు..అలాగే ఎలిమినేట్ అయిన పునర్నవి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. షో ప్రారంభమైన మొదటిలో యాంకర్ నాగార్జున ఇంటిలో ఉన్న సభ్యులను నవరాత్రి సందర్భంగా నవరసాలు పలికించాలని హౌస్ సభ్యులను కోరడం జరిగింది. 


టాస్క్ లో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో రసాన్ని ఇచ్చి వారిని పెర్ఫార్మ్ చేయమని చెప్పారు నాగార్జున. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఒక్కో రసాన్ని ఒలకబోస్తూ తమ పెర్ఫామెన్స్‌తో మెప్పించారు. అనంతరం ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చారు నాగార్జున. ఈ వారం రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌లు నామినేట్‌ కాగా.. తొలుత డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని భావించారు. కానీ నాగార్జున ఎక్కువ ఆలస్యం చేయకుండా పునర్నవి పేరు అనౌన్స్ చేశారు. దీంతో పునర్నవి హౌస్ నుండి బయటకి వచ్చేసింది. స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో ముచ్చటించిన పునర్నవి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మన టీవీ ద్వారా మాట్లాడింది.


రాహుల్ ని పునర్నవి కోసం ఓ పాట పాడాలని నాగార్జున అడగగా.. రాహుల్ 'ఏమైపోయావో..' అంటూ పాట మొదలుపెట్టి  ఎమోషనల్ అయిపోయాడు రాహుల్. పునర్నవి కోసం వెక్కి వెక్కి ఏడ్వడంతో హౌస్ మేట్స్ అందరూ రాహుల్ ని...ఓదార్చడం జరిగింది. ఈ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ...పునర్నవి..హౌస్ లో తనకు స్పెషల్ పర్సన్ ..నా గురించి ఎక్కువ కేర్ తీసుకుంటుంది అంటూ నాగార్జున కి తెలపడం జరిగింది. మొత్తం మీద పునర్నవి ఎలిమినేషన్ తో రాహుల్ చాలా బాధకు గురి అవ్వడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: