తెలుగులో వస్తున్న బిగ్ బాస్ ఇప్పటికీ 50 రోజులు దాటింది.  ఈ పదకొండో వారం తర్వాత ఇంటి సభ్యులకు ప్రేక్షకులకు ఒక రకమైన బంధం లాంటిది ఏర్పడిందని చెప్పొచ్చు.  అలాగే ఇంట్లో ఉన్నవారికి కూడా ఇలాంటి సఖ్యత చోటు చేసుకుంది. టాస్క్, గేమ్స్ పరంగా చూసుకుంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నా..తర్వాత సమయంలో వారంతా కలిసి మెలిసి ఉంటారు. ఇలా కలిసి ఉన్నవారిలో పునర్నవి, రాహూల్ సిప్లిగంజ్.  మొదట్లో వీరిద్దరూ పెద్దగా పరిచయం లేేని వ్యక్తుల్లా ఉన్నా..తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. 


ఈ జంటపక్షులను చూస్తే ప్రేక్షకులు కూడా చాలా సంతోషపడేవారు.  ఒక్కోసారి తిట్టుకోవడం..అలగడం..తర్వాత కలిసిపోవడం..ఇలా ఈ పదకొండు వారాలు ఇట్టే గడిసిపోయింది.  ఇక నిన్నలి ఎలిమినేషన్ లో పునర్నవి భూపాలం ఇంటి నుంచి వెళ్లిపోయింది.  అయితే పునర్నవి మొదటి నుంచి దూకుడుగా ఉంటూ వచ్చింది.  షూ తుడిచే టాస్క్ లో తాను పాల్గొనబోనని బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టింది. 


ఇలా ఎన్నో వైలన్స్ యాక్షన్ చూపించిన పున్ను నిన్న అందరినీ ఎడిపించింది. ముఖ్యంగా ఆమె స్నేహితుడు రాహూల్ అయితే ఎక్కి ఎక్కి ఏడ్చాడు. వెళ్లిపోమాకే అనే పాట పాడిన రాహూల్ మద్యలోనే కన్నీరు పెట్టుకున్నాడు. అందరూ ఓదార్చినా ఆపలేదు. అయితే పున్ను మాత్రం అతన్ని నవ్వించడానికి తెగ ప్రయత్నం చేసింది కానీ రాహూల్ బాధను ఎవ్వరూ తీర్చలేకపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: