రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన చిరంజీవి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన జరిగిన తర్వాత మొదట ఎలక్షన్లు జరిగిన తరువాత కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోవడంతో వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తాజాగా ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో...చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ఇటీవల విడుదలై ‘ఇంద్ర’ తరహాలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 'రంగస్థలం' సినిమా తర్వాత చాలాకాలానికి మెగా కాంపౌండ్ నుండి మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలయ్యి అదిరిపోయే హిట్టు ‘సైరా’ రూపంలో తమకు ఇవ్వటంతో మెగా అభిమానులు దసరా పండుగ ‘సైరా’ సినిమా హాల్లో చేసుకుంటూ హడావుడి సృష్టిస్తున్నారు.


తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదలైన సైరా...బాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే సౌత్ లోనే ఎక్కువ ఆదరణ దక్కించుకొని...అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చిరంజీవి చాలా కాలం తర్వాత హిట్టు కొట్టడంతో చిరంజీవి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. చాలా మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీకి చెందిన వారు చిరంజీవి బ్యాక్ అంటూ ఆయన ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు అని కామెంట్ చేస్తున్నారు.


అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పటివరకు సైరా సినిమా సక్సెస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చిరంజీవి...వెంటనే రేపటినుండి తన తర్వాత చేయబోయే కొరటాల సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే కొరటాలతో చేయబోయే సినిమా కోసం చిరంజీవి స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయాలని డైరెక్టర్ కొరటాల కి చిరంజీవి ఆదేశించినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: