హిట్ ఆ ప్లాప్ ఆ అనేది పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు తీసుకుంటూ సినిమా నెంబర్ పెంచుకుంటున్న అది సాయి కుమార్ ఇప్పుడు మళ్ళి ఓ కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పేరే  'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఇప్పటికే ఈ మధ్య వచ్చిన బుర్ర కథ, జోడి సినిమాలతో పరాజయాలను చవి చుసిన అది ఈసారి ఎలా అయినా సరే హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. 

     

దీంతో తాజాగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని విజయదశమి కానుకగా చిత్ర బృందం విడుదల చేసింది. 19 జనవరి 1990, కశ్మీర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంతో రచయిత అబ్బూరి రవి నటుడిగా పరిచయమవుతున్నాడు. 

     

పాక్ టెర్రరిస్టులకు, ఇండియా కమాండోలకు మధ్య జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు. ఇక ఆఫీసర్ కమాండో అర్జున్‌ పండిట్‌ గా ఆది ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల వీరోచిత పోరాటాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. 

       

 'ఒక్కసారి జైహిందే మా జిహద్‌ అయితే.. మీరే ఆలోచించుకోండి' అని సాయికుమార్ ఆది చెప్పే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాషా చెత్రి, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18 న విడుదల కానుంది. మరి ఈ చిత్రంతోనైనా ఆది హిట్ కొడుతాడో లేదో చూడాలి. 

            

మరింత సమాచారం తెలుసుకోండి: