టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస విజయాలతో కెరీర్ పరంగా మంచి ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న మహేష్, తప్పకుండా ఆ సినిమా మంచి సక్సెస్ ని సాధిస్తుంది అనే ఆశతో ఉన్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత, మురళి శర్మ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా 75 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకోవడం జరిగిందని, సూపర్ స్టార్ మహేష్ గారి ఫ్యాన్స్ ఆయన నుండి ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉందని, ఇటీవల ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. ఇకపోతే దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సేషనల్ పోస్టర్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం సిద్ధం చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి నిన్న తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటన చేయడం జరిగింది. 

ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో మహేష్ బాబు, కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ ముందు మాస్ లుక్ లో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. మహేష్ బాబు ఊర మాస లుక్ లో ఉన్న ఈ పోస్టర్ పై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుండగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు ముగ్గురూ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: