ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ దర్శకులు  తెలుగు సినిమాలను టార్గెట్ చేస్తున్నారు.  తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది.  ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలను హిందీలో ఎంచక్కా రీమేక్  చేసి సక్సెస్ అందుకుంటున్నారు మూవీ మేకర్స్. ఎందుకంటె కథ, స్క్రీన్ ప్లే కోసం పెద్దగా వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇలా తెలుగులో హిట్టైన సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు దర్శక,నిర్మాతలు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాను హిందీలో ‘సింబా’ పేరుతో రీమేక్  రోహిత్ శెట్టి ఇప్పుడు గీత గోవిందం రీమేక్ బాధ్యతలు  తీసుకుంటున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు.   విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమిస్ట్రీ కేక పెట్టించిన సినిమా  ‘గీత గోవిందం.  
అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాని  పరశురామ్ దర్శకత్వం వహించగా మంచి విజయం సాధించింది లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కొనుక్కున్నాట్టు  బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 


మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు  రోహిత్ శెట్టిగా తన  సినిమాల్లో యాక్షన్‌, రొమాన్స్‌కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. హిందీ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి మంచి విజయాలను అందుకోవడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నారట.  ఇందులో హీరోగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ అని ప్రచారం జరుగుతుంది.  ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్ సింగ్’లో నటించి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇప్పుడు తమ్ముడు ‘గీత గోవిందం’లో నటించనున్నాడు. మరి ఇతనికి విజయ్ దేవరకొండ లక్ కలిసొస్తుందో లేదో చూడాలి. అలా మొత్తానికి అన్నా తమ్ముళ్లు విజయ్ దేవరకొండ సినిమాలపై కన్నేశారు. 
ప్రస్తుతం డైరెక్టర్ రోహిత్ శెట్టి ‘సూర్యవంశి’ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా తర్వాత రోహిత్ గీత గోవిందం రీమేక్‌పై ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి.
కాగా మరోపక్క ఈ సినిమాను రోహిత్ శెట్టి  కాకుండా వేరే దర్శకుడు తెరకెక్కిస్తారని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: