టాలీవుడ్‌‌లో క్యూటెస్ట్ కపుల్ నాగ చైతన్య, సమంత. ఏ మాయ చేసావే చిత్రంలో జెస్సీ ప్రేమను పొందడానికి కార్తీక్ ఎంత తపనపడ్డాడో తెలుగు నాట అందరికీ తెలిసిందే. అయితే అది సినిమా కోసమే అయి ఉంటుందని అంతా అనుకున్నారు అప్పుడు. కానీ తీరా చూస్తే.. జెస్సీ, కార్తీక్ ఒక్కటయ్యారు. చక్కగా కాలాన్ని గడిపేస్తున్నారు. వెండితెరపై భార్యాభర్తలుగా నటించిన ఈ జంట నిజజీవితంలోనూ ఒక్కటై అభిమానులందర్నీ ఆశ్చర్యపరిచారు.సమంత, నాగ చైతన్య కలిసి నటించిన ఏ మాయ చేశావేచిత్రం నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది.

అది క్రమక్రమంగా పెరుగుతూ ప్రేమగా మారింది.  చివరకువీళ్లిద్దరు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.  వారి కథ సుఖాంతం అయింది. అయితే వారి ప్రేమకు పదేళ్లని సమంత పేర్కొంది. అంత కాలం వారిద్దరి వ్యవహారాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోవడం విశేషం. తాజాగా వీరిద్దరి పెళ్లి జరిగి ఈ ఆదివారానికి రెండేళ్లు.ఈ రోజు వీళ్లిద్దరు రెండో పెళ్లి వేడకను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు వాళ్లిద్దరు గతంలో దిగిన ఫోటోలను ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ....    నీ ప్రేమకు బందీనయ్య చైతన్య అని సమంత భావోద్వేగంతో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫోటోలతో పాటు వివిధ సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.దీంతో పాటు చైతూతో కలిసి డాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది సమంత. ఈ రెండేళ్లు ఎలా గడిచిపోయాయే తెలియడం లేదు. ఈ రెండేళ్లలో మా మధ్య ప్రేమ మరింత బలపడింది. వీరి రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్స్ నుండి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మహేష్ బాబు భార్య నమ్రత, కాజల్, త్రిష, హన్సిక,రానా, లావణ్య త్రిపాఠి, కోన వెంకట్,అల్లు స్నేహారెడ్డితో నందిని రెడ్డి ఉన్నారు. మొత్తంగా రెండో పెళ్లి రోజున సామ్, చైతూలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.



మరింత సమాచారం తెలుసుకోండి: