టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి, ఇటీవల గాంధీ జయంతి నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించగా రత్నవేలు కెమెరాని హ్యాండిల్ చేశారు. సాయి మాధవ్ బుర్రా గారు మాటలు సమకూర్చిన ఈ సినిమాకు కథను అందించింది పరుచూరి బ్రదర్స్. 1857లో తొలిసారి తెల్ల దొరలపై తిరుగుబాటు చేసిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో, 

మెగాస్టార్ నటన ఒక పెద్ద హైలైట్ అనే చెప్పాలి. ఆకట్టుకునే విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్, యుద్ధ సన్నివేశాలు, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి ఈ సినిమాలో బాగున్నప్పటికీ, దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో మాత్రం సినిమాను తెయలేకపోయారు అనే చెప్పాలి. భారీ రన్ టైం కలిగిన ఈ సినిమాలో అక్కడక్కడా కొంత ల్యాగ్ గా సాగుతూ, ఓవర్ అల్ గా పర్వాలేదనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి నేడు మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తనకు రామ్ చరణ్ తో కలిసి ఒక మంచి మల్టీస్టారర్ మూవీలో నటించాలని ఉందని, ఆ కోరిక అతి త్వరలో తీరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

అయితే అదే సందర్భంలో మరొక విలేఖరి మాట్లాడుతూ, చాలా ఏళ్ళ నుండి మీరు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నటిస్తే చూడాలి మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు, అసలు అది కుదురుతుందా అని అడగ్గా, తప్పకుండా కుదురుతుంది, ఎవరైనా మంచి దర్శకులు మా ఇద్దరికీ సరిగ్గా సరిపోయే కథను తీసుకువస్తే పవన్ తో కలిసి నటించడానికి నేను ఎప్పుడూ సిద్దమే అని అన్నారు మెగాస్టార్. ఇక మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు మెగా ఫ్యాన్స్ ఆ మల్టి స్టారర్ సినిమాలు అతి త్వరలో రావాలని కోరుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: