టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు కలెక్షన్లను సాధిస్తాయని చాలామంది ఇండస్ట్రీకు చెందిన వారు అంటారు. ప్రస్తుతం మహేష్ బాబు కెరీర్ గమనిస్తే స్పైడర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయిన తర్వాత చాలా ఆచితూచి అడుగులు వేస్తూ రెండు బ్లాక్ బస్టర్ లు అభిమానులకు అందించారు. కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను'...మరియు అదే విధంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లు అందుకున్న మహేష్ బాబు...హ్యాట్రిక్ కొట్టాలని కసితో ఆచి తూచి అడుగులు వేస్తూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఒప్పుకొని ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు.


ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ జవాన్ పాత్రలో నటిస్తున్నట్లు సినిమా స్టిల్స్ బట్టి అర్థం అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ను చూస్తే మాత్రం ఇక బాక్సాఫీస్ కు బ్యాండ్ తప్పదని గ్యారెంటీ గా మహేష్ బాబు హిస్టరీ క్రియేట్ చేయడం కన్ఫామ్ అని చూసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా 2003వ సంవత్సరంలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన 'ఒక్కడు' సినిమాతో కెరియర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న మహేష్ బాబు...ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా కర్నూల్ ప్రాంతంలోనే జరిగింది.


ఆ సినిమాలో కర్నూలు కొండారెడ్డి బురుజు సీన్ అయితే టాలీవుడ్ లో ఇప్పటికి ఒక బెంచ్ మార్క్..అలాంటిది మరోసారి ఇప్పుడు అదే ప్రాంతంలో మరో మాస్ మసాలా సీన్ కు శ్రీకారం చుట్టాడు అనీల్ దీనికి సంబంధించిన పోస్టర్ నే దసరా సందర్భంగా విడుదల చేసి సూపర్ స్టార్ అభిమానులకు సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. విడుదలైన సరిలేరు నీకు ఎవరు సినిమాకి సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్తి పట్టుకుని కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో మహేష్ బాబు నిలవడం చూస్తున్న మహేష్ అభిమానులు హ్యాట్రిక్ గ్యారెంటీ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: