తెలుగులో ఎంతో మంది మెగా హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్
చిరంజీవి క్రేజ్ మాత్రం పవన్ కళ్యాన్ కి వచ్చింది. అయితే ఈ మద్య
పవన్ కళ్యాన్ రాజకీయాల్లో చుకుగ్గా పాల్గొంటున్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో
పవన్ కళ్యాన్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ కి మాస్ ఇమేజ్ వచ్చింది.
తెలుగు లో
రామ్ చరణ్ ఇటీవల నిర్మాతగా మారి మెగాస్టార్
చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి ’ నిర్మించారు. ఇక వక్కంతం వంశి దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ సినిమాలో నటించిన
అల్లు అర్జున్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. దేశభక్తితో వచ్చిన ఈ మూవీ పెద్దగా హిట్ కాకపోవడంతో నెక్ట్స్ సినిమా మంచి హిట్ కొట్టాలని ఎన్నో కథలు వచ్చినా..పక్కకు పెడుతూ వచ్చాడు. గతంలో రెండు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ కే మరోసారి జై కొట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా ‘అల వైకుంఠపురములో’ తెరకెక్కుతుంది.
ఈ మూవీలో అల్లు అర్జన్ సరసన
పూజా హెగ్డే నటిస్తుంది. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, బన్నీ డైలాగ్, ‘సామజవరగమన’సాంగ్తో ఈ సినిమాపై హైప్ను క్రియేట్ చేశాయి. తాజాగా బన్నీ అభిమానులకు
దసరా కానుకగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది.