అక్కినేని ఫ్యామీలి మల్టీస్టారర్ మనం సినిమా వచ్చి ఆ ఫ్యామిలీ కి చిరకాలం గుర్తుండిపోయో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు జీవితాంతం అక్కినేని ఫ్యామిలీకి చెరగని ముద్ర వేసిన సినిమాగా మిగిలిపోయింది. అలాగే మంచు మల్టీస్టారర్.. అంటూ ఫ్యామిలీ మల్టీస్టారర్లు బాగానే సందడి చేశాయి. దగ్గుబాటి మల్టీస్టారర్.. నందమూరి మల్టీస్టారర్ అంటు హడావుడి మొదలైనా అవి అలా పెండింగులో ఉన్నాయి. ఈలోగానే కొణిదెల (మెగా) మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోంది. ఇది మెగా మల్టీస్టారర్ కాబోతోందని లేటస్ట్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి సైరా ఇచ్చిన సక్సెస్ తో  ఉత్సాహంగా ఈ మెగా మల్టీస్టారర్ ని అధికారికంగానే ప్రకటించేశారు. ఈ దెబ్బతో అందరికి పక్కా క్లారిటి వచ్చింది. ఈ మల్టీ స్టారర్ ఒక సంచలనం  కాబోతోందని హిస్టరిలో రికార్డ్ గా మిగలబోతోందని మెగా ఫ్యాన్స్ సంబరంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రకటనతో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో పాటు.. రామ్ చరణ్ తో కలిసి పూర్తి స్థాయి సినిమాని మెగాస్టార్ అధికారికంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన సైరా సక్సెస్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చరణ్ తో కలిసి సినిమా చేయడం నాకు ఎంత ఇష్టమో.. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ సినిమా చేయడం అంటే అంత ఇష్టమని అన్నారు. పవన్ వస్తే కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. చరణ్ - పవన్ తోనూ కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ మాటలు మెగా ఫ్యాన్స్ నే కాదు దర్శక నిర్మాతలకు ఎంతో ఉత్సాహాన్ని ఆనాందాన్ని ఇస్తున్నాయి.

నా కొడుకుతో చేస్తే ఎంత ఆనందం వస్తుందో .. నా తమ్ముడుతో చేసినా అంతే ఆనందం. సంతోషం కలుగుతుంది. ఎవరైనా మంచి కథ తో వస్తే .. పవన్ తో సినిమా చేయడానికి నేను చరణ్ రెడీ అని చిరంజీవి అన్నారు. ఇదొక్కటే కాదు చరణ్ తో కలిసి చిరు నటించే సినిమాకి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమాలో చిరు-చరణ్ కలిసి నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. చిరు 152వ సినిమాలో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తారని..ఆ ఎపిసోడ్ కథలో చాలా కీలకమని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం ఇంకా మెగా కాంపౌండ్ నుండి బయటకు రావలసి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: