‘సైరా’ సక్సస్ మ్యానియా నుండి తేరుకుని చిరంజీవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొరటాల శివ మూవీకి లైన్ క్లియర్ చేయడంతో ఈ మూవీ ప్రారంభోత్సవ పూజ ఈరోజు జరగబోతోంది. కొరటాల చిరంజీవి మూవీ నిర్మాణ పనుల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో తీసుకున్న ఒక ప్రత్యేకమైన ఆఫీసులో ఈరోజు ఈపూజా కార్యక్రమం నిర్వహింపబడుతోంది. 

ఈ మూవీని నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కొరటాల శివకు కూడ భాగస్వామ్యం అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో రాజమౌళి తరువాత ఇలా వరస సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక దర్శకుడుగా కొరటాల శివ కొనసాగుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. దీనితో మిడిల్ ఏజ్ ఉన్న చిరంజీవి పాత్రకు హీరోయిన్ గా అనుష్క త్రిషలను అనుకున్నారు.

అయితే ‘సైరా’ మూవీ విషయంలో తమన్నాతో చిరంజీవి నటించినందుకు కొన్ని విమర్శలు వచ్చిన నేపధ్యంలో అలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా చిరంజీవి మధ్యవయస్సు పాత్రకు టబు లేదంటే భూమికను ఎంపిక చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ప్రస్తుతం టబు ‘అల వైకుంఠపురంలో’ కీలక పాత్ర చేయడంతో పాటు టబు బాగా సన్నపడి లుక్ పరంగా కూడ బాగా కనిపిస్తున్న నేపధ్యంలో చిరంజీవి పక్కన టబు నటించడం ఫైనల్ అని అంటున్నారు. దీనితో ‘సైరా’ టబు కు ఊహించని అదృష్టం అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: