పండగ వస్తే చాలు సినీ జనాలు కూడా అందరిని ఊరిస్తూ పండుగ చేసుకుంటారు. అదేంటో అనుకోకండి.. కొత్త సినిమాలకు తెర తీస్తారు.. అలా పండుగను టార్గెట్ చేస్తూ రిలీజ్  చేస్తారు కూడా.. ఈ విదంగా ఎప్పటి నుండో జరుగుతుంది. ఇకపోతే ఈరోజు విజయదశమి. ఈ విజయ దశమి సందర్బంగా చాలా మంది సినీ జనాలు సినిమాలకు సంబంధించి పోస్టర్స్ లేదా ట్రైలరస్సో  విడుదల చేస్తారు. మరికొందరేమో సినిమాలకు ముహుర్తాలు కూడా పెట్టుకుంటారు. 


ఈరోజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి కొత్త పోస్టర్ రిలీజ్ కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్నా అల వైకుంఠపురములో సినిమా నుండి కూడా మరో పోస్టర్ రిలీజ్ అయింది. ఇకపోతే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. రెండు పెద్ద హీరోల సినిమాలు కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 


విక్టరీ వెంకీ, చైతు నటిస్తున్న వెంకీ మామ నుంచి మరో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది. బాలయ్య నటిస్తున్న 105 వ చిత్రానికి రూలర్ అని ఫిక్స్ చేశారు. సాయి కుమార్ కొడుకు నటిస్తున్న గోల్డ్ ఫిష్ ట్రైలర్స్ రిలీజ్ అవ్వడం.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాకు ఈరోజు ముహూర్తం పెట్టి షూటింగ్ పనులు ప్రారంభించారు. మరి కొన్ని కొత్త సినిమా కూడా ముహుర్తాలు పెట్టాయి. ఈ దసరాకి దుమ్ము రేపాయని వేరేలా చెప్పనక్కర్లేదు.. 


ఈ విదంగా చుస్తే ఈ దేవి నవరాత్రుల దేవి అనుగ్రం వల్ల చాలా మంది చాలా రకాలుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. వారు అనుకున్న పనులు అన్ని విజయ వంతంగా పూర్తవుతాయి. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అమ్మ వారిని పూజిస్తూ ఉంటారు. అమ్మ కటాక్షం వల్ల అన్ని శుభాలు చేకూరుతాయని వారి నమ్మకం. ఇకపోతే సైరా, సాహో వంటి సినిమాలు వచ్చిన కూడా బోల్తా పడ్డాయి ఈ సారి వస్తున్నా సినిమాలన్నా కూడా హిట్ అవుతాయేమో చూడాలి.. 





మరింత సమాచారం తెలుసుకోండి: