స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో చేస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన మొదటి సాంగ్ సామజవరగమన రిలీజై సూపర్ హిట్టైంది. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అనుకున్నట్టుగానే ఓ క్రేజీ పోస్టర్ తో వచ్చాడు అల్లు అర్జున్. ఫైట్ సీన్ కు సంబందించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.


ఫస్ట్ లుక్ టీజర్ లో ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలా.. వచ్చింది.. అంటూ రిలీజ్ అవగా ఇప్పుడు కొత్తగా రిలీజైన ఈ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. సంక్రాంతి బరిలో వస్తున్న క్రేజీ మూవీగా అల వైకుంఠపురములో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టేలా ఉంది. సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ వంటి స్టార్స్ కూడా సినిమాలో నటిస్తున్నారు.


ఈ సినిమాలో అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అవగా రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ కూడా పక్కా హిట్టు అంటున్నారు చిత్రయూనిట్. మరి సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా వస్తుండగా ఆ సినిమాకు బన్ని ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి. ఓ పక్క హీరోయిన్ పూజా హెగ్దె కూడా ఇప్పుడు మంచి ఫాంలో ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ తో కూడా ఆమె నటిస్తున్న ఈ మూవీ పక్కా హిట్ అన్నట్టే లెక్క. 



మరింత సమాచారం తెలుసుకోండి: