హిందీ లో సంచలన విజయం సాధించిన " లస్ట్ స్టోరీస్" తెలుగు లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరిస్ 2018 లో నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫమ్ లో రిలీజ్ అయ్యింది..ఈ సినిమాలో నాలుగు భాగాలు ఉంటాయి.లస్ట్ స్టోరీస్ ని హిందీ లో అనురాగ్ కశ్యప్, కరన్ జోహర్,జోయా అక్తర్, మరియు దిబాకర్
బెనర్జీ లు దర్సకత్వం వహించారు..ఇందులో
భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ.విక్కి కౌశల్,మనీషా కోయిరాలా,భూమి పడ్నేకర్ మరియు రాధికా ఆప్టే లు ప్రధాన పాత్రల్లో నటించారు.
తెలుగు లో కూడా నాలుగు భాగాలను నాలుగురు దర్శకులు తెరకెక్కించనున్నారట . తెలుగు వర్షన్ కి నందిని రెడ్డి,
తరుణ్ భాస్కర్ ,
సందీప్ రెడ్డి వంగా ,
సంకల్ప్ రెడ్డి లు దర్శకత్వం వహించనున్నారు . తెలుగు లస్ట్ స్టోరీస్ లో ఎవరు నటించబోతున్నరనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో సమంత , నాగశౌర్య , రాజేంద్రప్రసాద్, లక్ష్మి లు ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా రోజుల తరువాత దర్శకురాలు
నందిని రెడ్డి కి మంచి విజయం లభించింది.
నందిని రెడ్డి దర్శకత్వం వహించే లస్ట్ స్టోరీస్ పార్ట్ లో అమల పాల్ - జగపతి బాబు నటించనున్నారట. రీసెంట్ గా ఆమె సినిమా తో అందరిని ఆశ్చర్యపరిచిన అమల పాల్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారాట. .
కియారా అద్వానీ కెరియర్ కి లస్ట్ స్టారీస్ చాలా హెల్స్ అయ్యింది. ఈ వార్త నిజమైతే లస్ట్ స్టోరీస్ అమల పాల్ కెరియర్ కి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి. ఈ పార్ట్ లో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా నటించనున్నాడని వార్తలు వినబడుతున్నాయి. జగపతి బాబు -అమల పాల్ జోడీ మధ్య ఘాటైన రొమాన్స్ .. అదరచుంబనాలు.. బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన చేయలేదు