విక్టరీ వెంకటేష్, నాగచైతన్యల కలయికలో యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం వెంకీ మామ. నిజ జీవితంలో మామ అల్లుళ్లయిన వెంకటేష్ మరియు నాగ చైతన్య, ఈ సినిమాలో కూడా అవే పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా, చైతన్య సరసన రాశి ఖన్నా జోడి కడుతోంది. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాల నేపథ్యంలో మంచి కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ పల్లెటూరి రైతుగా నటిస్తుండగా, 

చైతన్య మిలిటరీలోకి వెళ్లే సోల్జర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 'గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా' అంటూ విక్టరీ వెంకటేష్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. 'ఏమంటుందిరా ఇందాకటి నుండి ప్రాక్టీస్ చేస్తుంటే ఐ లవ్ యు ఐ లవ్ యు అంటుంది' అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ఎంతో సరదాగా ఉంటుంది. ఇకపోతే ఈ టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అనే చెప్పాలి. 

కాగా ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో జై లవకుశ సినిమాతో మంచి హిట్ కొట్టిన బాబీ, తప్పకుండా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: