టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం పర్వాలేదనిపించే కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినేమాను తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

ఈ సినిమా ఫలితం యావరేజ్ గా ఉన్నప్పటికీ, సినిమాలో మెగాస్టార్ పెర్ఫార్మన్స్ గురించి మాత్రం ఎంత చెప్పినా తక్కువే అని అనాలి. ఇక మెగాస్టార్ నటించిన 150 సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం రిలీజ్ అయిన సైరా సినిమా మరొక ఎత్తని, నిజంగా నరసింహారెడ్డి గారి పాత్రలో మెగాస్టార్ నటించారు అని అనడం కంటే, జీవించారని చెప్పాలని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు మరియు సినిమా ప్రముఖులు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని ఇటీవల మీడియాతో తన అనుభవాలు పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి, సైరా విషయమై తాను ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప విషయాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టడం జరిగింది. 

ఈ సినిమా చూసి అప్పటికే పలువురు సినిమా ప్రముఖులు తనకు ఫోన్స్ చేస్తుండగా, మధ్యలో విక్టరీ వెంకటేష్ గారి నుండి ఫోన్ వచ్చిందని అన్నారు. మీతో మాట్లాడాలి ఎక్కడున్నారు అని వెంకీ అడిగారని, అయితే ఆ సమయంలో నేను బయట ఉండడంతో ఫోన్ లో మాట్లాడండి పర్వాలేదు అని చెప్పినప్పటికీ, కాదు కాదు నేను ఇంటికి వచ్చి మిమల్ని కలుస్తాను వెంటనే ఇంటికి రండి అని చెప్పి, అక్కడినుండి కేవలం ఒక ఒక పది నిమిషాల్లో తన ఇంటికివచ్చి తనని మనసారా కౌగిలించుకుని ముద్దుకూడా పెట్టుకున్నారట వెంకీ. నిజంగా సైరాలో మీరు నటించిన తీరు అద్భుతం, ఆ పాత్రకు జీవం పోశారు అంటూ వెంకీ తనపై పొగడ్తలు కురిపించడం తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తు చేసుకుని ఎంతో సంబరపడిపోయారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: