ప్రస్తుతం తెలుగు సూపర్ స్టార్
ప్రిన్స్ మహేష్ బాబు 26 చిత్రంగా రానున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ.. ఎఫ్ 2 ఫెమ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటుంది. ఈ రోజు
దసరా సందర్బంగా కొత్త పోస్టర్ రిలీజ్ అయింది.
ఈ సినిమాలో
మహేష్ కి జోడిగా విజయ్
బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాలో
మహేష్ బాబు మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఫ్రెండ్ చనిపోతే అతను ఎలా చనిపోయాడు అనే విషయం తెలుసుకోవడానికి
మహేష్ ఆ విలేజ్ వెళ్లి తెలుసుకొంటాడు ఆ సమయంలో
మహేష్ ఎలా సమస్యలు ఎదుర్కొంటాడు చూడాలి.
ఈ సినిమాలో
మహేష్ కు అమ్మగా సీనియర్ నటి విజయ శాంతి ఈ సినిమాలో నటిస్తుంది.
ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు
మహేష్ బాబు 50 కోట్లు ఈసుకొన్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజానికి
మహేష్ బాబు అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదట. సినిమా వాటాలో పెర్సన్ట్ తీసుకుంటున్నాడని ఈ చిత్ర నిర్మాత
అనిల్ సుంకర వెల్లడించారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రానున్న సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రొడక్షన్ లో భాగంగా దిల్
రాజ్ కు కూడా వాటా ఉండనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్ మేజర్
అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు.
దసరా సందర్భంగా చిత్రయూనిట్ సోమవారం సినిమాకు సంబంధించిన సూపర్ పోస్టర్ను విడుదలచేసింది. ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా వస్తుంది. దానితో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..