అక్కీ ... ఈ పేరు బాలీవుడ్ సినిమాలు చూసేవారికి బాగా సుపరిచితం. ఎందుకంటే అతను మరి ఎవరో కాదు అందరికి సుపరిచితుడైన కిలాడీ అక్షయ్ కుమార్. ఈయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. అతడి నడక, నడత, క్రమశిక్షణ ప్రతిదీ యువతరం నటులకు ఆదర్శం. స్టైలింగ్ పరంగానూ అక్షయ్ బాలీవుడ్ స్టార్లందరిలోనూ డిఫిరెంట్. ఈయన కథల పరంగా అతడు ఏ కాన్సెప్టుని ఎంచుకున్నా అది సక్సెస్సే.


అక్షయ్ కుమార్ వందల కోట్లు రాబట్టాలనే ఆశతో కాకుండా సేఫ్ గేమ్ ఆడాలన్న తెలివితేటలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ విలక్షణ శైలి ఉందని నిరూపిస్తున్నాడు. కానీ ప్రస్తుతం 2019లో ఇప్పటికే రెండు మూడు హిట్లు కొట్టాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. సక్సెస్ జోష్ లో ఉన్నాడు అక్కీ. తన వార్షికాదాయంలో ఏమాత్రం తగ్గుదల లేకుండా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోనూ చేరిపోయాడు ఈయన. 


అందుకే అక్కీ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, రానా, రితేష్ తదితర తారాగణం నటించిన భారీ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 4 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ అంత ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంది. కానీ ఈ సినిమా సందర్భంగా అక్షయ్ సహా చిత్రబృందం ప్రచారంలో బిజీబిజీగా ఉంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో అక్షయ్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు.


ఇటీవలే గుండు కొట్టించి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తాజాగా గుండు బాస్ తో కలిసి భామలంతా రొమాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో అందాల భామలు కృతి సనోన్, కృతి కర్భంద, పూజా హెగ్డే ఇలా వేడెక్కించే భామలంతా కిలాడీతో ఫోజిచ్చారు. ఈ ఫోటో చూడడానికి చాలా హాట్ గా ఉంది అని సామాజిక మాధ్యమాలలో కామెంట్స్ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: