సూపర్ స్టార్
మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి
మహేష్ గొడ్డలి పట్టుకున్న పోజు ను
దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేశారు. అంతేకాదు బాలయ్య నటిస్తున్న 105 నుండి, అలాగే బన్నీ తన కొత్త 'అల' సినిమా నుంచి మాస్ లుక్ రిలీజ్ చేశారు. ఇలా చాలామంది హీరోలు విజయదశమి సందర్భంగా పోస్టర్లతో హంగామా చేస్తున్నారు. అయితే ఒక్క
మహేష్ మాత్రమే తన మూవీ పోస్టర్ తో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. కొత్తగా రిలీజ్ చేసిన సరిలేరు పోస్టర్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి
మహేష్ కొత్త స్టిల్ వచ్చింది. ఫిలింసిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ ముందు
మహేష్ గొడ్డలితో నిల్చున్న పోజు అని సమాచారం. ఈ ఫొటోతో
మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
మహేష్ మాస్ లుక్ అంటూ తెగ హంగామా చేశారు. కానీ సోషల్ మీడియా మాత్రం దీనికి భిన్నంగా రియాక్ట్ అయింది.
మహేష్ డ్రెస్, పట్టుకున్న ఆయుధం మాత్రమే మారిందని.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ సాక్ష్యాలతో సహా కామెంట్ చేయడం మొదలు పెట్టారు.
'భరత్ అనే నేను' సినిమాలో
మహేష్ కత్తి పట్టుకుంటాడు. ఇక మహర్షిలో ఓ ఫైట్ సీన్ లో ఏదో చిన్న ఆయుధం పట్టుకుంటాడు మహేష్. శ్రీమంతుడు సినిమాలో కూడా రాడ్ పట్టుకుంటాడు. ఇలా వెపన్స్ మారుస్తున్న
మహేష్ నిల్చునే పోజు, తన లుక్ మాత్రం మారడం లేదంటూ కామెంట్లు విసురుతున్నారు. ఇంకొంతమంది అయితే కొండారెడ్డి బురుజు ముందు
మహేష్ ఉన్న స్టిల్ ను తీసేసి,
భరత్ అనే నేనులో
మహేష్ స్టిల్ ను పెట్టి మార్ఫింగ్ చేసి అస్సలు తేడా లేదంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక
మహేష్ తో
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఓ వైపు అంచనాలు పెరుగుతున్నా, మరోవైపు మాత్రం బాగా విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాదు
మహేష్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా వద్దంటూ
అనిల్ రావిపూడి కి సలహాలు ఇస్తున్నారు. కారణం ఫుల్ లెంగ్త్ కామెడీ చేసిన ప్రతిసారి
మహేష్ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి కంటెంట్ తో ఉన్నసినిమా చేయాలని సలహాలిస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్ ట్రోలింగ్స్ ఇంకా సినిమాకి మైనస్ అవుతోంది.