టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీసన్ 3 ప్రస్తుతం టీవీ ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పుకుంటుంది . స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ 3 రియాల్టీ షో రోజు రోజుకి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. హౌస్ లో బిగ్ బాస్ టాస్కులకి లకు కంటెస్టెంట్స్ చేసే రచ్చ  అయితే అబ్బో ఓ  రేంజ్ లో ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ గొడవతో  బిగ్ బాస్ 3 అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు ఎలిమినేషన్లు  లో కామనే కదా. ప్రతివారం హౌస్ సభ్యులలో కొంతమంది నామినేట్ అవ్వడం నామినేట్ అయిన సభ్యుల్లో  ఒకరు వారాంతంలో నాగార్జున వచ్చి  ఎలిమినేట్ చేయడం ఇదంతా బిగ్ బాస్ హౌస్  లో కామెనే  అయినప్పటికీ.... ప్రతివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మాత్రం ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతోంది . 

 

 

 

 

 వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ చేసే  రచ్చ ఒక ఎత్తయితే... వారంతంలో వచ్చి  నాగార్జున చేసే సందడి ఒకెత్తు . ఎప్పుడూ ఎంతో కూల్ గా  ఉండే నాగార్జున వారంతంలో వచ్చి బిగ్ బాస్3 హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు వార్నింగ్ ఇవ్వడం... ఆ తర్వాత వాళ్ళ తో సందడి చేయించటం  ఇదంతా ప్రేక్షకులను టీవీకి కట్టిపడేస్తుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్3 హౌస్ నుండి చాలామంది ఎలిమినేట్ అయ్యారు . తాజాగా హౌస్ లో 76 రోజులపాటు  గడిపి  77వ రోజు  హౌస్ నుండి బయటకు వచ్చేసింది పునర్నవి భూపాలం.

 

 

 

 

 

బిగ్ బాస్3 హౌస్ నుండి తాజాగా బయటకు వచ్చిన పునర్నవి భూపాలం తన ఫేస్ బుక్  ఖాతాలో దసరా సందర్భంగా ఒక పోస్ట్ పెట్టింది . మనసు, శరీరానికి జరిగిన డామేజ్ నుంచి మెల్ల మెల్లగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని... దసరా ముందు ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది . అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టు పెట్టింది పునర్నవి భూపాలం. కాగా  పునర్నవి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: