ఈ సారి దసరా పండగ సినిమా అభిమానులకు ఒకరోజు ముందే వచ్చేసింది. తమ స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ ఇలా దసరా సందర్భంగా వస్తాయని ఊహించకపోవడంతో ఫ్యాన్స్ కి సంతోషం మామూలుగా లేదు. అందులోను టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా వరుసబెట్టి ఇలా తమ సినిమా పోస్టర్స్ తో ప్రేక్షకులకు విష్ చేయడం నిజంగా ఆనందించాల్సిన విషయం. మహర్షి వంటి క్లాస్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా పూజా హెగ్డే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక దసరా శుభాకాంక్షలతో రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

ఇక అల్లు అర్జున్ కి  జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి లాంటి డీసెంట్ హిట్స్ ని ఇచ్చిన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ ఈసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ 'అల' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ కలిసి భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కానుంది. 

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన 'అల వైకుంఠపురంలో' తొలి పాట సామజవరగమన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ వీడియో సాంగ్ 2కోట్లు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. ఇక తాజాగా విజయదశమి సందర్భంగా 'అల' కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో బన్ని యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ తో యాక్షన్ సీన్స్ ఒక రెంజ్ లో ఉండబోతున్నాయని మన మాటల మాంత్రీకుడు చెప్పకనే చెప్పారు. 

ఈ ఇద్దరి తో పాటు బాలయ్య కూడా ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ - కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ బీకే 105 గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ముందునుంచే ఈ సినిమాలో బాలయ్య మేకోవర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా దసరా కానుకగా ఎన్ బీకే 105 కొత్త పోస్టర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య ను చూస్తుంటే మరో సారి సింహా, లెజెండ్ తరహాలో 105 లో పాత్ర ఉండబోతోందని బాలయ్య ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఏదేమైనా ఈ దసరా కి అందరు తమ తమ సినిమా అప్‌డేట్స్ తో ప్రేక్షకులను బాగానే ఆనందపరచారు. ఇలా ప్రేక్షకులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన వాళ్ళలో రాజుగారి గది-3 సినిమా కూడా ఉండటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: