నటి, నిర్మాత, దర్శకురాలైన మంజుల ఘట్టమనేని మరో మారు నటించనున్నారు. హీరోయిన్ హన్సిక తో పాటు నషా అనే ఒక వెబ్ సిరీస్ లో ఆమె ఒక పాత్ర చేస్తున్నారని సమాచారం.

 

పిల్లజమీందార్ మరియు భాగమతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు అశోక్ ఈ వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే నషా వెబ్ సిరీస్ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉందని సమాచారం. ముంబైలో నషా వెబ్ సిరీస్ చిత్రీకరణ జరుపుకొంటుంది. నటుడు అశుతోష్ రానా కూడా ఈ వెబ్ సిరీస్ లో ఒక పాత్ర చేస్తున్నారు.

 

ఇటీవలే మనసుకు నచ్చింది అనే చిత్రానికి దర్శకత్వం వహించిన మంజుల షో, ఆరంజ్, కావ్యాస్ డైరీ వంటి చిత్రాలలో నటించారు. ఇక నిర్మాతగా కూడా ఆమె కొన్ని చిత్రాలు తెరకెక్కించడం జరిగింది. 2013లో వచ్చిన సేవకుడు చిత్రం తరువాత మంజుల ఏ చిత్రంలో నటించలేదు. మళ్లీ ఆరేళ్ళ తరువాత ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలకపాత్ర చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: